ys jagan
నిత్య యాత్రికుడి నయా చరిత్ర

జగన్..ఓ సంచలనం… ఓ చరిత్ర… ఓ రికార్డ్.. యువతకు ఉత్సాహం…భవితకు సంకేతం.. ఉప్పొంగే జనప్రవాహపు కెరటం.. నవవసంతం కోసం వేచి చూస్తున్న నయా స్వరం. అందుకే వర్తమాన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరికీ సాధ్యం కాని స్థాయిలో ఉంటుంది ఆయన వ్యవహారం. 14 నెలల సుదీర్ఘకాలం క్రితం ఇడుపులపాయలో ప్రారంభమయిన ప్రజా సంకల్పం ఇచ్ఛాపురం లో విజయ సంకల్పంతో ముగిపోయబోతున్న వేళ అందరి దృష్టి ఇప్పుడు అటు మళ్ళింది. నిజానికి జగన్ నిత్య యాత్రికుడు. తండ్రి మరణం తర్వాత ఓదార్పుయాత్రతో రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తే, తండ్రి బాటలోనే ‘ప్రజా ప్రస్థానం’ స్థాయిని మించి పాదయాత్రతో అపూర్వ ఘనత సాధించారు. జగన్ యాత్రల మీద భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు గానీ, సొంత పార్టీని పునాదుల నుంచి నిర్మించుకుంటూ ఇంత సుదీర్ఘకాలం పాటు అధికారంతో సంబంధం లేకుండా ప్రజల మధ్య నిలబెట్టడం చిన్నRead More
అతడిని నేనెప్పుడూ చూడనేలేదంటున్నజగన్

వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై తన అంచనాలు వెల్లడించారు. ముఖ్యంగా చంద్రబాబుకి, తనకు మధ్యే పోటీ ఉందని అంగీకరించారు. అదే సమయంలో పవన్ తీరు మీద జగన్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఏపీలో ప్రస్తుతం అత్యంత తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉందన్నారు. 1994, 2004 ఫలితాలను గమనిస్తే అధికార పక్షాలు మట్టిరకొట్టుకుపోయాయని వివరించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కలిసి పోటీ చేస్తే తాను సంతోషిస్తానన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక తగ్గి తాము సునాయాసంగా విజయం సాధిస్తామన్నారు. పొత్తులకు అవకాశం ఉన్నప్పటికీ దేవుడు, ప్రజల మీద విశ్వాసంతోనే తాను సాగుతున్నట్టు వెల్లడించారు పవన్ కళ్యాణ్ తో కలుస్తున్నారన్న ప్రచారంపై తాను ఇంతవరకూ పవన్ ని చూడనేలేదని, అలాంటి వ్యక్తి మీద మాట్లాడడం తగదన్నారు. తెలంగాణాలో చంద్రబాబుకి జనసేన మద్ధతుRead More
జగన్ కేసులో చంద్రబాబు సర్కారుకి ఝలక్

ఏపీ ప్రభుత్వానికి ఝలక్ తగిలింది. విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన వ్యవహారం చివరకు ప్రభుత్వ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ కేసు విషయంలో కేంద్రానికి బదలాయించేందుకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్ ఐ ఏ కి దర్యాప్తు జరపడానికి తగ్గట్టుగా చర్యలు కనిపిస్తున్నాయి. కోర్ట్ లో తాజా విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ఏజీ వాదనను కోర్ట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. సెక్షన్ 3(ఏ) ఎందుకు నమోదు చేయలేదని నిలదీసింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ గా చెప్పేందుకు చేసిన ప్రయత్నాన్ని హైకోర్ట్ ఏకీభవించలేదు. 14వ తేదీకి విచారణ వాయిదా వేశారు. ఈలోగా కేంద్రమే నిర్ణయం తీసుకుని కేసును ఎన్ ఐ ఏ కి ఇస్తారా లేదా అన్నది తేల్చేలని ఆదేశించింది. ఈ కేసులో నివేదికను కేంద్రానికి అందించామనిRead More
ఆదరణ పెరిగినా అనిల్ కి అసలు పరీక్ష అక్కడే..!

తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాజకీయాల అనుభవం కూడా పెద్దగా లేదు. అయినా అందరిన నోళ్లలో నానుతున్నారు. వాక్చాతుర్యంతో పలువురి అభిమానాన్ని సంపాదించారు. అందుకే నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ ఇప్పుడు పలువురి దృష్టి ఉంది. తొలుత అసెంబ్లీలో ప్రైవేటు విద్యాసంస్థల మీద జరిగిన చర్చలో అనిల్ ఉపన్యాసం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన మాట తీరు, సబ్జెక్ ప్రజంటేషన్ పలువురిని ఆకట్టుకుంది. సీనియర్ ఎమ్మెల్యేల స్థాయిలో సభలో అందరినీ ఆలోచింపజేసిన ప్రసంగం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. వాస్తవానికి అనిల్ కుమార్ 29 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికయిన డాక్టరేట్ ఉన్న నేత. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంచి డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ సాధించారు. అయినప్పటికీ ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రాధాన్యతనిస్తారనే పేరుంది. యూఎస్ లో గడిపినప్పటికీ నెల్లూరు వీధుల్లో కూడా అదే రీతిలోRead More
జగన్ కోటలో టీడీపీ అభ్యర్థి ఖరారు

వచ్చే ఎన్నికల్లో తగిన అభ్యర్థుల విషయంలో అన్ని పార్టీలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అవసరం అనుకున్న చోట ఇతర పార్టీల నేతలకు వల వేస్తున్నారు. మరో ప్రత్యామ్నాయం లేని నాయకులు కూడా వెంటనే జంపింగ్ కి సిద్ధమవుతున్నారు. తాజాగా ఆ జాబితాలో మాజీ మంత్రి అహ్మదుల్లా చేరారు. వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గాల్లో పనిచేసిన ఆయన రెండు సార్లు కడప నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ సన్నిహితుడయినప్పటికీ జగన్ కి మాత్రం దూరంగా ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ తరుపున అంజాద్ బాషా విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆయన వైసీపీ నుంచి బరిలో దిగడం ఖాయంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా మైనార్టీ నేతను రంగంలో దింపేందుకు పావులు కదిపింది. అహ్మదుల్లాని పార్టీలో కి ఆహ్వానించింది.Read More
జగన్ తో చేతులు కలిపిన మరో సీనియర్

ఏపీ రాజకీయాల్లో జంపింగ్ లో ఊపందుకున్నాయి. తాజాగా కాంగ్రెస్ కి రాజీనామా చేసిన మాజీ మంత్రి సీ రామచంద్రయ్య వైఎస్సార్ కాంగ్రెస్ గూటికి చేరారు. దాంతో కడప జిల్లాలో వైసీపీకి అదనపు ప్రయోజనం దక్కుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గం కీలకంగా వ్యవహరించే వైసీపీలో బలిజ సామాజికవర్గ నేత సీ రామచంద్రయ్యకు ప్రధాన బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. రాయలసీమలో ప్రభావితం చేయగల బలిజ సామాజికవర్గానికి చెందిన సీఆర్ రాకతో వైసీపీకి మేలు జరుగుతుందనే అభిప్రాయం జగన్ శిబిరంలో వినిపిస్తోంది. స్వతహాగా చార్టెడ్ అకౌంటెంట్ అయిన రామచంద్రయ్య ఎన్టీఆర్ స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. ఆతర్వాత ప్రజారాజ్యం రాకతో టీడీపీని వీడి చిరంజీవి వెంట నడిచారు. ఆ తర్వాత పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కిరణ్ మంత్రివర్గంలో ఎమ్మెల్సీ కోటాలో అమాత్య హోదా దక్కించుకున్నారు. ఇకRead More
జగన్ మర్డర్ ప్లాన్ ముందే జరిగింది..!

వైఎస్ జగన్ పై జరిగిన మర్డర్ అటెంప్ట్ పక్కా స్కెచ్ అని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయితే అందులో మరింత ఆశ్చర్యపడే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బయటకు వచ్చిన సెక్యూరిటీ రిపోర్ట్ ని పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లం అవుతోంది. నిందితుడు శ్రీనివాస్ కి ప్రత్యేక అనుమతులు ఇప్పించడం వెనుక అసలు కథ వెలుగులోకి వస్తే నిర్ఘాంతపోయే నిజాలు అందరికీ అర్థమయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి క్యాంటీన్ లో పనిచేసే శ్రీనివాస్ కి ఎయిర్ పోర్ట్ చెక్ ఇన్ ఏరియా దాటి వెళ్లే అవకాశం లేదు. బీసీఏఎస్ నుంచి అతనికి ఎలాంటి క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా లేదు. అయితే అనూహ్యంగా అక్టోబర్ 1 నుంచి 30 వ తారీఖు వరకు ఎయిర్ పోర్ట్ లో ఆయనకు ప్రత్యేక అనుమతులు దక్కయన్న ప్రచారం ఇప్పుడు ముందుకొచ్చింది. ఆశ్చర్యంRead More
టీడీపీకి షాక్, జగన్ తో చేతులు కలిపిన నేతలు

అధికార తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఒకే రోజు ఇద్దరు కీలక నేతలు ఆపార్టీని వీడారు. ఒకరు ఏకంగా సీఎం సొంత జిల్లా చిత్తూరు జిల్లాకు చెందిన ఎంపీపీ కాగా, మరొకరు గోదావరి జిల్లాల్లో కీలక సామాజికవర్గానికి చెందిన పారిశ్రామికవేత్త కావడం విశేషం. తాంబల్లపల్లి నియోజకవర్గం పీటీఎం మండలం ఎంపీపీగా ఉన్న కొండా గీతమ్మ, కొండా సిద్ధార్థ్ తమ అనుచరులతో కలిసి జగన్ చేతుల మీదుగా కండువాలు కప్పుకున్నారు. ఆయనకు తోడుగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవారినికి చెందిన మార్గాని నాగేశ్వర రావు తన తనయుడు, సినీ హీరో మార్గాని భరత్ తో కలిసి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. దాంతో ఈ ఇద్దరు నేతలు టీడీపీకి ఝలక్ ఇవ్వడం విశేషంగా మారింది. టీడీపీకి ఇది పెద్ద షాక్ గా భావిస్తున్నారు. టీడీపీలో 40 ఏళ్ల పాటుRead More
జగన్ నోరు తెరిస్తే…!

ఏపీ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు తప్పవనిపిస్తోంది. రాజకీయంగా మళ్లీ వేడి రాజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే మూడు నాలుగు రోజులలో విపక్ష నేత పెదవి విప్పబోతున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో అక్టోబర్ 25నాటి ఘటనలపై ఆయన ఇప్పటి వరకూ స్పందించ లేదు. కేవలం రెండు ట్వీట్లు మినహా తనపై దాడి వ్యవహారం గురించి జగన్ మాట్లాడకపోవడం చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రజాసంకల్పయాత్రకు శ్రీకారం చుట్టిన జగన్ దానికి ముందే మీడియాతో మాట్లాడతారని అంతా భావించారు. కానీ ఈసారి విజయమ్మ తెరమీదకు వచ్చారు. తన బిడ్డను జనాలకు అప్పగిస్తున్నానని, కడుపు కోత మిగల్చవద్దని వేడుకుంటూ ఆమె పూర్తి సెంటిమెంట్ తో మాట్లాడారు. అదే సమయంలో జగన్ మాత్రం ఇప్పటికీ నోరు మెదకపోవడంతో వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. వాస్తవానికి జగన్ పై దాడి ఘటనపై అధికార,Read More
పవన్,జగన్ ని కలుపుతున్న సీనియర్ నాయకుడు

ఏపీ రాజకీయాల్లో విపక్షాల మధ్య సఖ్యత తప్పదనే ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా జనాదరణ కలిగిన ఇద్దరు నేతలు చేతులు కలిపేందుకు రంగం సిద్ధమవుతుందనే వాదన ఎక్కువగా టీడీపీ శిబిరం నుంచి వినిపిస్తోంది. బీజేపీ దర్శకత్వంలో పవన్, జగన్ కలిసి సాగేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు పలుమార్లు ప్రచారం చేస్తోంది. దాంతో అటు వైసీపీ, ఇటు జనసేన వర్గాల్లో కలయికపై పెద్ద స్థాయిలో చర్చ సాగుతోంది. తాజాగా టీడీపీ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశాలవుతున్నాయి. ప్రధానంగా విశాఖ కేంద్రంగా పవన్, జగన్ మధ్య చర్చలు సాగినట్టు ఆయన ఆరోపిస్తున్నారు. వారిద్దరినీ ఓ గూటికి తెచ్చేందుకు ఇన్నాళ్లుగా బీజేపీ నేతల ఆదేశాలే కారణమని చెప్పిన టీడీపీ నేతల్లో తాజాగా వట్టి రమేష్ పేరు ముందుకు రావడం విశేషంగా మారింది. మాజీ మంత్రి, ఇటీవలRead More